Thursday, April 25, 2024

మంత్రులతో మంచు మనోజ్…!!

మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మి సినిమా చేస్తున్నాడు. అయితే మంచు మనోజ్ కు సంబంధించి ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక భేటీ ఏర్పాటు చేసింది. అయితే అందులో మంచు మనోజ్ పాల్గొనటం విశేషం. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి పై చర్చించారు.

ఆ మీటింగ్ లో మంచు మనోజ్ కుమార్ అడ్వెంచర్స్ టూరిజం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. కాగా సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారని మంత్రులు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement