Thursday, April 25, 2024

క‌రాటే క‌ళ్యాణికి షోకాజు నోటీసులు.. వివ‌ర‌ణ ఇవ్వాల‌న్న మంచు విష్ణు

న‌టి క‌రాటే క‌ళ్యాణికి మా అధ్య‌క్షుడు మంచు విష్ణు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఇటీవల సీనియ‌ర్ ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారి చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంచు విష్ణు ఆదేశించారు. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో తారకరామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టింది. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఆమె పేర్కొంది. దేవుడి రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాని కరాటే కళ్యాణి తెలిపింది. తాజాగా ఈ వివాదంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మా అసోసియేషన్ నుంచి ఆమెకు షోకాజ్ నోటీసులు పంపించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement