Tuesday, March 26, 2024

రాధే శ్యామ్ నుంచి ప్రేక్షకులకు థ్రిల్ తప్పదా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా రీషూట్ కోసం మరో పది రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూట్ వాయిదా పడింది. అయితే ఈ చిత్రం గురించి ఒక సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో లవ్ తో పాటు కొన్ని సీన్స్ అభిమానులను థ్రిల్ చేసేవిధంగా ఉంటాయట. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ఆదిపురుష్ లో పాల్గొనబోతున్నారు ప్రభాస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement