Tuesday, April 23, 2024

శివ‌రాజ్ కుమార్.. బాల‌య్య‌ల మ‌ల్టీస్టార‌ర్

ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ మూవీలు వ‌చ్చాయి. కాగా ఇప్పుడు ఈ వార్త నంద‌మూరి ఫ్యాన్స్ తో పాటు క‌న్న‌డ ఫ్యాన్స్ కి కూడా ఊపినిచ్చేదిగా ఉంది. కాగా నందమూరి ఫ్యామిలీ.. కన్నడాలో కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీ మధ్య అనుబంధం మామూలుది కాదు. ముఖ్యంగా బాలయ్య అంటే శివరాజ్ కుమార్ తో పాటు.. దివంగత పునిత్ రాజ్ కుమార్ కు కూడా చాలా ఇష్టం. బాలయ్య కాని.. వారు కాని రెండు ఫ్యామిలీలు ఇంట్లో మనుషుల్లా కలిసిపోయి ఉంటారు. పునిత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య బాబు కన్నీరు పెట్టుకున్నారు. అంత అనుబంధం వీరిది. ఇక ఈరెండు ఫ్యామిలీల హీరోల నుంచి మల్టీ స్టారర్ మూవీ వస్తే చూడాలని. అటు కన్నడ, ఇటు తెలుగు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
ఈక్రమంలో కన్నడ స్టార్ సీనియర్ హీరో శివరాజ్ కుమార్..అలియాస్ శివయ్య..ఇటు నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు కన్నడ హీరో శివరాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరయిన శివయ్యా.. తాము, బాలయ్య మంచి స్నేహితులమని. తన తండ్రి రాజ్ కుమార్, ఎన్టీఆర్ కూడా మంచి స్నేహుతలన్నారు. దాంతో మాకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడుతుంది. బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళం. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాం అని తెలిపారు. ఈ మాటతో.. స్టేజ్ దద్దరిల్లింది. నందమూరి, కంఠీరవ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఈసినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా..ఎప్పుడెప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా అని చూస్తున్నారు. ఇప్పుడీ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement