Wednesday, April 17, 2024

ఎన్నికల వ్యూహకర్త పీకే పై వెబ్ సిరీస్ ? షారుఖ్ ఖాన్ ప్లాన్!!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యమంత్రి సీట్లలో ఆయన అనుకున్నా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టడం ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకత. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమతాబెనర్జీ చాలామందిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు ప్రశాంత్ కిషోర్. కాగా తాజాగా ప్రశాంత్ కిషోర్ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను తీయబోతున్నట్లు గా తెలుస్తోంది. మరోవైపు షారుక్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement