Tuesday, March 19, 2024

షారుక్, అట్లీ సినిమాపై ఆగస్టు 15న అదిరిపోయే అప్డేట్!!

ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. బాలీవుడ్ నాట అయితే అది మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అనౌన్స్ చుసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదానిపై ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా సినీ అభిమానులందరిలోను ఆసక్తి నెలకొంది.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 15న బిగ్ అనౌన్స్ చేయబోతున్నారట. ఇప్పటికే హీరో ఎంట్రీ టీజర్ కట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో నయనతార హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement