Saturday, April 20, 2024

ఆగ‌స్టులో ‘స‌ర్కార్ వారి పాట’

క‌రోనా దెబ్బ‌కి పెద్ద సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. వీటిల్లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కార్ వారి పాట కూడా ఒక‌టి. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. కాగా ఇప్పుడా డేట్ కూడా వాయిదా ప‌డింది. షూటింగ్ లో జ‌రుగుతోన్న జాప్యం వ‌ల్ల ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్ర యూనిట్. క‌రోనా కారణంగా ఎక్కడ తేడా కొట్టేసినా దసరా సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయలా అనిపిస్తోంది. మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. మైత్రీ – 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్ కొన్ని రోజులుగా రెస్టు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కాంబినేషన్లో లేని సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు కూడా పండుగ తరువాత ఈ సినిమా షూటింగులో జాయిన్ కావలసి ఉంది. కానీ ఆయనకి కరోనా రావడం .. రీసెంట్ గా రమేశ్ బాబు చనిపోవడం కారణంగా ప్లానింగ్ మారిపోయింది. కరోనా తీవ్రతను బట్టి మహేశ్ కి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement