Saturday, April 20, 2024

సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్..

మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్న‌ మోస్ట్ ఎవైటింగ్ మూవీ స‌ర్కారు వారి పాటకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 14న మొద‌టి పాట విడుద‌ల కానుంద‌ని నిర్థార‌ణ అయింది. ఇప్ప‌టిదాకా ఈ సినిమాకు సంబంధించి పెద్ద‌గా వార్త‌లేవీ రాలేదు. కాగా, వాలంటైన్స్ డే సంద‌ర్భంగా మ‌హేశ్ అభిమానుల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ కానుక ఇవ్వ‌నున్నారు అని స్ప‌ష్టం అయిన సంకేతాల‌యితే చిత్ర యూనిట్ ఇస్తోంది.

ఈ అప్డేట్ తో ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది. ఇక సినిమా విడుద‌ల కూడా వేస‌విలోనే ఉండే ఛాన్స్ ఉంది. ప‌రశురాం దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను మ‌హేశ్ బాబుతో స‌హా మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్ ప్ల‌స్ నిర్మాణ సంస్థ‌లు నిర్మించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement