Thursday, April 25, 2024

సర్కారు వారు సిద్ధం అయ్యారు

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ నేడు స్టార్ట్ చేశారు.

ఇక తాజాగా చిత్ర యూనిట్ కు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను నాన్ స్టాప్ గా మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అలాగే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement