Friday, March 29, 2024

అప్డేట్స్ పై సర్కారు వారి పాట టీం రియాక్షన్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.

అయితే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. అదే విషయం పై యూనిట్ స్పందించింది.సర్కారు వారి పాట చిత్రంపై ఉత్సుకత కోలాహలం తీవ్రస్థాయిలో ఉన్నాయని అయితే తాము విడుదల చేసే అప్డేట్స్ మామూలుగా ఉండవని అభిమానులను మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. షూటింగ్ ప్రారంభం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంచుకుంటామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అప్పటి వరకు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ జాగ్రత్త గా ఉండాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement