Thursday, March 28, 2024

‘సరిలేరు నీకెవ్వరు’ మరో సరికొత్త రికార్డ్

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. అలాగే సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించారు.

ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 లో అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ 50 చిత్రాలలో టాలీవుడ్ నుంచి ఏకైక చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో 41వ స్థానంలో నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement