Friday, April 19, 2024

ఓటీటీ లో సందీప్ కిషన్ డబుల్ ధమాకా !!

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సరైన హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ విజయం సాధించినప్పటికీ… అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయాడు. అయితే వీటితో పాటు మరో మూడు సినిమాలు సందీప్ కిషన్ చేతిలో ఉన్నాయి. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాల షూటింగ్ లు నిలిపివేస్తున్నారు. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలను ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కాగా ఇప్పుడు సందీప్ కిషన్ నటించిన రెండు సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ చాలాకాలం కిందట తమిళంలో నగరసూరన్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ సమయానికి సినిమాహాళ్లు మూతపడ్డాయి. దీంతో నిర్మాతలు సోనీ లైవ్ ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే మరో తమిళ సినిమా కథ కసడ తపర సోనీ లైవ్ ఓటీటీ లో జూన్ నెలలో రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement