Thursday, April 25, 2024

చిరంజీవి సినిమాలో సముద్రఖని!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు. లూసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే లూసిఫర్ ఒరిజినల్ కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించనున్నారు మోహన్ రాజా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు సముద్రఖని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడిగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సముద్రఖని… ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంతో పాటు, సర్కార్ వారి పాట, ఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాలలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సముద్రఖని.

Advertisement

తాజా వార్తలు

Advertisement