Friday, April 19, 2024

ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కేనా? ‘రిపబ్లిక్’ మూవీ టీజర్

సాయిధరమ్ తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘రిపబ్లిక్’ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని ‘ప్రస్థానం’ ఫేం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ అభిగా కనిపించనున్నాడు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు అనే భ్రమలో ప్రజలు బతుకుతున్నారనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. కాగా ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. జూన్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement