Friday, April 26, 2024

సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పి వసూళ్లు !!

స్టార్ హీరోలు, దర్శకుల పేర్లు చెప్పి ఎక్కడికక్కడే మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి మోసాల బారిన ఇప్పటికే ఎంతో మంది పడ్డారు. అయితే తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. తన పేరు చెప్పి ఎవరో ఆర్థిక సహాయం అడుగుతున్నారట. ఈ విషయం తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న సాయి ధరంతేజ్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఈ మేర సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఎవరో నా పేరు మీద నేను పనిచేసిన సహచరుల నటులు, ఇతరుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని అడుగుతున్నాడట. ఈ విషయంపై నేను పోలీసులకు పిర్యాదు చేస్తున్నా. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాటిని నమ్మకండి. నాపేరు మీద వచ్చే సందేశాలను పట్టించుకోకండి అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement