Saturday, April 20, 2024

ఓటీటీలో అజయి దేవగన్‌ దర్శకత్వంలో రూపొందిన రన్‌వే 34..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : డిజిటల్‌ సబ్‌స్కిప్ష్రన్‌ కంటే ముందుగా అంటే 27 మే నుంచి ప్రైమ్‌ వీడియోలో కొత్తగా ప్రారంభించిన మూవీ రెంటల్స్‌ ద్వారా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ముందుగానే యాక్సెస్‌ చేసుకోవచ్చు. అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేయని కనువిందు చేసే ఫుటేజ్‌ను అజయ్‌ దేవగన్‌ అందిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై అజయ్‌ దేవగన్‌ నిర్మించి, దర్శకత్వం వహించి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బొమన్‌ ఇరానీ, అంగీరా ధర్‌, ఆకాంక్ష సింగ్‌, ఇతర ప్రధాన పాత్రధారులు. ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా ఈ చిత్రం జూన్‌ 24 నుంచి అందుబాటులో ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement