Thursday, April 18, 2024

కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాక్ స్టార్

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన మ్యూజిక్ తో సినీ అభిమానులను అలాగే సంగీత అభిమానులను ఉర్రూతలూగించే దేవీశ్రీ ప్రసాద్ కొత్త టాలెంట్ ని బయటికి తీసుకు రావడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ వీడియోని పోస్ట్ చేస్తూ దేవిశ్రీప్రసాద్ కు ట్యాగ్ చేసి అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఖచ్చితంగా అనే మాట ఇచ్చారు.

ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నాడు దేవిశ్రీప్రసాద్. పూర్తి వివరాలు సేకరించి తన తమిళ సింగింగ్ ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చామని చెప్పుకొచ్చాడు దేవిశ్రీప్రసాద్. ఆమె పేరు శ్రావణి అని, ఆమె మెదక్ జిల్లాకు చెందిన అమ్మాయి అని అద్భుతంగా పాడింది అని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కు తెలపగా ఇదే విషయంపై ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement