Thursday, April 25, 2024

మళ్ళీ తెరపైకి రేణుదేశాయ్ పెళ్లి – ఇప్పుడు ఎందుకు ఆ ఫోటో పెట్టారో ?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. వారి పిల్లలు, అకీరా ఆద్య లకు సంబంధించిన ఫోటోలను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా రేణుదేశాయ్ ఓ ఫోటోని పోస్ట్ చేసింది. తన చేతికి డైమండ్ ఉంగరం పెట్టుకొని ఆ ఫోటోలో కనిపించింది. గతంలో ఎంగేజ్మెంట్ సమయంలో ధరించిన రింగ్ తో పాటు ఈ డైమండ్ రింగ్ ఉండటంవల్ల మళ్లీ రేణు దేశాయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొంతమంది రేణుదేశాయ్ కి విషెస్ కూడా తెలుపుతున్నారు. గతంలో 2018 జూన్ లో రేణుదేశాయ్….పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని వేరుపడిన తర్వాత ఒంటరితనం వేధిస్తోందని తనను అర్థం చేసుకునే జీవితభాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే 2018 జూన్ 25న తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పుకొచ్చింది. నా చేతిని ఎప్పటికీ వీడకు.. నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళకు. ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికానంటూ రేణు దేశాయ్ తనకి కాబోయే వాడి చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ ఆ తరువాత రేణుదేశాయ్ పెళ్లికి సంబంధించి ఎక్కడ స్పందించలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్ళీ చేతి వేలి ఉంగరాన్ని పోస్ట్ చేయడంతో పెళ్లి వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

https://www.instagram.com/p/CNt9uLvhMsa/?igshid=f07c6chhzo7x

Advertisement

తాజా వార్తలు

Advertisement