Wednesday, April 24, 2024

నెటిజన్స్ పై రేణుదేశాయ్ ఫైర్…మీ హాయ్, హలో మెసేజ్ వల్ల లాభం ఏంటి ?

కరోనా సమయంలో పేద ప్రజలకు కొంత మంది సెలబ్రిటీలు సహాయం చేస్తున్నారు. అందులో ఒకరు రేణు దేశాయ్. సహాయం అడిగిన వారికి తన వంతుగా హెల్ప్ చేస్తోంది రేణు. అయితే ఇప్పుడు కొంత మంది నెటిజన్లు పై ఆగ్రహం వ్యక్తం చేసింది రేణుదేశాయ్. మీరు హలో హాయ్ అని మెసేజ్ లు చేస్తున్నారు. ఆ మెసేజ్ ల వల్ల అత్యవసరమైన బాధితుల మెసేజ్ లు కిందకి వెళ్తున్నాయని… వాటిని చూసేందుకు వీలు కావడం లేదని చెప్పుకొచ్చారు రేణుదేశాయ్.

కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారి మందుల విషయంలో చేతనైన సహాయం చేస్తున్నట్లు తెలిపారు రేణు. అలాగే సోనూసూద్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోను లాంటి వారే ప్రస్తుతం దేశానికి కావాలని… పథకాలతో పని జరగదన్నారు. ఒక వ్యక్తికి నిజమైన అవసరం ఏంటో దాన్ని అందించాలని చెప్పారు. అందుకే తన వంతుగా సహాయం చేస్తున్నట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. మెసేజ్ లు పెట్టి టైం వేస్ట్ చేయద్దు అని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement