Thursday, April 25, 2024

ఏం పనిలేదు..ఎప్పుడూ పవన్‌ గురించే: రేణు దేశాయ్

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు నటి రేణు దేశాయ్. అంతేకాదు రేణు దేశాయ్ తరచుగా పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయలకు సంబంధించిన అప్ డేట్స్ పై స్పందిస్తుంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియలో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది రేణు. పవన్‌కళ్యాణ్‌ గురించి మాట్లాడుతుంటే నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారని అంటున్నారు రేణు దేశాయ్‌.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె కుమార్తె ఆద్యతో కలిసి రీసెంట్‌గా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ అకీరా ఎందుకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండడు అని ప్రశ్నించగా .. ఆమె బదులిస్తూ అకీరాకు అన్ని సోషల్‌ మీడియాల్లో అకౌంట్స్‌ ఉన్నాయి. అయితే అవన్నీ తన ప్రైవేట్‌. తనకు పబ్లిక్‌ చేయడం ఇష్టం లేదు. ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని రేణు తెలిపారు. మరో నెటిజన్‌ పవన్‌కళ్యాణ్‌ గురించి మాట్లాడమని కోరగా ఆయన గురించి ఏం మాట్లాడను. మీరేమో మాట్లాడమంటారు. నేను మాట్లాడటం మొదలు పెట్టగానే రేణుకి పనిలేదు.. ఎప్పుడూ పవన్‌ గురించే మాట్లాడుతుంటుందని మీరే అంటారు. నాపై కామెంట్స్‌ చేస్తారు. అందువల్ల నేను లైవ్‌లోకి రావడం లేదు అని తెలిపారు రేణు.

Advertisement

తాజా వార్తలు

Advertisement