Friday, April 26, 2024

సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇక రేణు దేశాయ్ చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. కాగా ఇటీవల రేణు దేశాయ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ లోపు రేణుదేశాయ్ బుల్లి తెరపై తళుక్కున మెరుస్తూ అందరినీ షాక్ కి గురి చేసింది.

రేణు దేశాయ్ ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీతెలుగు కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రాధమ్మ కూతురు అనే సీరియల్ లో రేణు దేశాయ్ మెరిసారు. ఆ సీరియల్ లో పార్వతీదేవిగా గెస్ట్ రోల్ చేశారు. అయితే ఆ సీరియల్ కి సంబంధించి వర్కింగ్ స్టిల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన అభిమానులు రేణు దేశాయ్ ఇక నుంచి సీరియల్స్ లో కూడా నటిస్తుందా అనే సందిగ్దతలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement