Saturday, April 20, 2024

పక్క కమర్షియల్ సెట్ లో నవ్వులు పూయిస్తున్న రాశిఖన్నా

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. యువి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే గతంలో రాశిఖన్నా మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే సినిమా లో ఏంజల్ ఆర్నా గా నటించి నవ్వించింది.

ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో కూడా ఫన్నీ పాత్రలో రాశిఖన్నా నటిస్తుందని తెలుస్తోంది. తాజాగా పక్కా కమర్షియల్ సెట్ లో హీరోయిన్ రాశిఖన్నా జాయిన్ అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ లో రాశిఖన్నా నవ్వుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 1 2020న రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement