Friday, April 19, 2024

రంగ్ దే, అరణ్య ఓటీటీ డేట్లు వచ్చేశాయి

నితిన్ హీరోగా నటించిన ‘రంగ్ దే’ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. మార్చి 26న విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈనెల 21 నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ పాటలు శ్రోతలను అలరించాయి.

మరోవైపు రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘అరణ్య’ మూవీ కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీ కూడా మార్చి 26నే విడుదల కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement