Friday, March 29, 2024

మరో పాన్ ఇండియా చిత్రానికి రానా గ్రీన్ సిగ్నల్

బాహుబలి, ఘాజీ, అరణ్య వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు దగ్గుబాటి రానా. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను సిహెచ్ రాంబాబు తో కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పుడు రానా మరో పాన్ ఇండియా సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రానా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఈ కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారు రానా. దేవుడు, జంబలకడిపంబ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ చిత్రాలను గతంలో గోపీనాథ్ నిర్మించారు. ఇటీవల నయనతార నటించిన అంజలి సిబిఐ ను నిర్మించారు. ఇప్పుడు రానా తో ఈ పాన్ ఇండియా సినిమా నిర్మించబోతున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అయిందని కథాకథనం కథానాయకుడి పాత్ర చిత్రీకరణ ఇందులో కొత్తగా ఉంటాయని గోపీనాథ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement