Thursday, April 18, 2024

రమ్యకృష్ణ సాయి ధరమ్ తేజ్ ల మధ్య మాములుగా ఉండదట!!

దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ రమ్యకృష్ణ మధ్య ఫైటింగ్ సూపర్ గా ఉంటుందట.

అహంభావంతో కూడిన అధికారానికి బాధ్యతతో కూడిన అధికారానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం గా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement