Tuesday, March 26, 2024

సిద్దా అడుగుపెట్టాడు!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇదే విషయాన్ని చెబుతూ రామ్ చరణ్ ఆచార్య సినిమాకు సంబంధించి ఓ కొత్త పోస్టర్ ని పోస్ట్ చేస్తూ షూటింగ్ రీస్టార్ట్ అయింది అని చెబుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ షెడ్యూల్ తో ఆచార్య సినిమా మొత్తం పూర్తి కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement