Saturday, April 20, 2024

‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’ – కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది!

జై జాస్తి, అనంతిక, జంటగా వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, ప్రణీత పట్నాయక్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’. నాని బండ్రెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాతలు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో, హీరోయిన్‌ లను ఎవరనేది తెలియజేసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేసూ ”పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు. జూన్‌ నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరించ‌నున్నారు. సెప్టెంబరులో విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement