Wednesday, April 24, 2024

‘రాధే శ్యామ్’ లో ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయట !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా మళ్లీ కొంత భాగం రీ షూట్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఆ షూట్ స్టార్ట్ చేయవలసిన సమయం లో సెకండ్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది.

దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను నిలిపివేసింది. అయితే రీ షూట్ మాత్రమే కాకుండా గ్రాఫికల్ వర్క్ పరంగా కూడా ఈ చిత్రంలో చాలా బ్యాలెన్స్ ఉందట. ఈ గ్రాఫికల్ వర్క్ కు మొదట అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. అలాగే విఎఫ్ఎక్స్ కూడా తప్పనిసరిగా అవసరం కాబట్టి… ఈ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా షూటింగ్ కోసం అధునాతన టెక్నాలజీని కూడా వినియోగించారని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబందించిన విజువల్ ట్రీట్ ఏ మేర ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement