Friday, April 26, 2024

రాధే శ్యామ్ రీ షూట్ ? ఫ్యాన్స్ నిరాశ

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అభిమానుల్లో నిరాశ కలిగిస్తుంది. రాధే శ్యామ్ రీషూట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ అసంతృప్తిని వ్యక్తం చేశారని.. సన్నివేశాలకు కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ ఇస్తూ రాధాకృష్ణకు చెప్పాడట. ఇప్పటికే ఓ సాంగ్ షూటింగ్ మిగిలి ఉండగా అది పూర్తయ్యాక ఈ రీ షూట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement