Friday, March 29, 2024

ఆలస్యం అయిన థియేటర్స్ లోనే !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ ,ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాధేశ్యామ్ దాదాపుగా షూటింగ్ ను కంప్లీట్ చేసింది. మరో పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నిజానికి ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని సల్మాన్ రాధే సినిమాలా థియేటర్స్ లో అలాగే ఓటీటీ లో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదట. కాస్త ఆలస్యం అయినా సరే ఈ సినిమాను థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement