Friday, April 19, 2024

రాధే శ్యామ్ పై రాధా కృష్ణ అప్డేట్ ఇచ్చేసాడు!!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్.. పీరియాడికల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

మొదట షూట్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ కి ప్లాన్ చేశారు. మళ్లీ దానిని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ అధికారికంగా తెలుపుతూ ట్వీట్ చేశాడు. కరోనా పాండమిక్ మీ అందరి అంచనాలనూ దెబ్బతీసింది. కానీ ఇంకో మూడు రోజుల్లో ఓ అప్డేట్ వదులుతున్నాం…మీ కోసం అంటూ రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ మూడు రోజుల్లో ఏ అప్డేట్ ఇస్తారు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement