Friday, April 19, 2024

విజయ్ కోసం మైక్ టైసన్ ను దించుతున్న పూరీ జగన్నాథ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అలాగే విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక ఈ సినిమాను పూరి, ఛార్మి, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ కొరియోగ్రాఫర్ టీం ను తీసుకువచ్చారు. ముంబైలోని ఓ భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయింది.

అయితే ఈ సినిమాపై తాజాగా మరింత ఆసక్తిని పెంచేలా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రం కోసం అమెరికన్ లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ ను రంగంలోకి దించబోతున్నారట. కీలకమైన యాక్షన్ సీన్ లో ఈ ఇంటర్నేషనల్ బాక్సర్ ను తీసుకురాబోతున్నారట. మరి ఇందులో కొంత వరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆయాగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement