Friday, April 19, 2024

పూరీ జగన్నాథ్ తో యశ్… ఫిక్స్ ?

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది గతకొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తరువాత సినిమా కన్నడ స్టార్ కేజిఎఫ్ హీరో యశ్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రం ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక పూరి జగన్నాథ్ పంపిన స్క్రిప్ట్ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లైగర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తో ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్2 సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement