Thursday, April 25, 2024

‘లవ్ స్టొరీ’ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ !!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నిజానికి ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల చివరిలో తెలుగు రాష్ట్రాలలో 50శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకొనున్నాయని టాక్ నడుస్తుంది.

కాగా లవ్ స్టోరీ సినిమా రిలీజ్ విషయంలో కూడా రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే లవ్ స్టోరీ రిలీజ్ పై నిర్మాత సునీల్ నారంగ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత తర్వాతే లవ్ స్టోరీ థియేటర్స్ లో విడుదల అవుతుందని థియేటర్లలో రోజుకు మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇస్తే ఆ సమయంలో లవ్ స్టోరీని రిలీజ్ చేయాలని అనుకోవడం లేదని అన్నారు. జూలై 2వ వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనే అభిప్రాయం కు వచ్చామని ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు అధికారికంగా తేదీని వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement