Friday, March 29, 2024

ధనుష్ సరసన శర్వానంద్ హీరోయిన్

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శుక్రవారం విడుదలైన కర్ణన్ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి రోజు 10.40 కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండో రోజు 5.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. శుక్రవారం వరకు థియేటర్స్ లో నూరు శాతం ఆక్యుపెన్సీ ఉండగా శనివారం నుండి తమిళనాడు ప్రభుత్వం దీనిని 50 శాతం కు తగ్గించింది. దాంతో కలెక్షన్లు తగ్గాయి.

ఆదివారం 6.50 కోట్లను కలెక్ట్ చేయాగ మొత్తం మూవీ 26 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తర్వాత బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు గాను ప్రియాంక అరుల్ మోహన్ ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోందట. మొదట కృతి శెట్టి పేర్లును పరిశీలించినప్పటికీ పూర్తిగా తెలుగు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కృతిశెట్టి కి కుదరలేదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement