Friday, March 29, 2024

ప్రియమణి పెళ్లి చెల్లదట!! తెరపైకి కొత్త వివాదం

హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. యమదొంగ, పెళ్లైన కొత్తలో, రగడ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది ప్రియమణి. అయితే 2007 లో ప్రియమణి ముస్తఫా ను వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రియమణి వివాహం చెల్లదని ముస్తఫా మొదటి భార్య ఆయేషా కోర్టుకెక్కారు. ఇంకా సెపరేట్ అయినప్పటికీ విడాకులు తీసుకోలేదు… కాబట్టి ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధమని ముస్తఫా పై గృహహింస కేసు నమోదు చేసింది.

కాగా ఆయేషా ముస్తఫా రాజులకు ఇద్దరు పిల్లలు. ఇప్పటికే కోర్టులో ఇదే విషయమై కేసు నడుస్తోంది. చట్ట ప్రకారం ముస్తఫా తన భర్త అని ప్రియమణితో అతని వివాహం చెల్లదని చెప్పుకొచ్చింది ఆయేషా.

Advertisement

తాజా వార్తలు

Advertisement