Saturday, April 20, 2024

నాలుగేళ్ల త‌ర్వాత సినిమాల్లోకి ప్రీతి జింత‌..

సినిమా రంగంలో ప‌లువురు న‌టీమ‌ణులు వివాహం చేసుకుని మ‌ళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వ‌డం మామూలే. కాగా న‌టి ప్రీతిజింత కూడా మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నటి త్వరలో ఫిల్మ్ మేకర్స్ డానిష్ రెంజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. కాశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రీతీ ధైర్యవంతురాలైన కశ్మీరీ తల్లి పాత్రను పోషించనుంది. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా కన్ఫర్మేషన్ రానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన పనులు మాత్రం జరుగుతున్నాయి. ప్రీతి జింత‌ ఇప్పటికే ‘వీర్ జరా’, ‘మిషన్ కశ్మీర్’ వంటి చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు కశ్మీర్‌ నేపథ్యంలో ఉన్నవే. అయితే ప్రస్తుతం చేసే సినిమా మొత్తం కశ్మీర్‌లోనే షూటింగ్‌ జరుపుకుంటుంది. ప్రీతి ఈ సినిమాతో పాటు ఇతర చిత్రాలలో కూడా నటించాలని కోరుకుంటుంది. 4 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి తిరిగి వస్తోంది. ప్రీతి చివరిగా 2018లో ‘భయ్యాజీ సూపర్‌హిట్’లో కనిపించింది. ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ప్రీతీ జింత సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల పేర్లు జై ఇంకా ,జియా అని వెల్లడించింది. తల్లి కావటంతో నా కొత్త ప్రయాణం మొదలైందని చెబుతూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement