Thursday, April 25, 2024

తెగేదాకా లాక్కండి…ప్రకాష్ రాజ్ వార్నింగ్ ఎవరికి ?

మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాకముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంత్రి విష్ణు, జీవిత రాజశేఖర్ ,నటి హేమ పోటీ చేయబోతున్నారు. అయితే తన ప్యానల్ ను ప్రకటిస్తూ ప్రకాష్ రాజ్… ఎవరు కూడా మీడియాతో మాట్లాడవద్దని గతంలోనే అనౌన్స్ చేశారు.

అయితే తాజాగా బుధవారం ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెగేదాకా లాక్కండి అంటూ ట్వీట్ చేసాడు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కాగా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి సమాధానం గా ఆయన స్పదిస్తూ.. నేను నాన్ లోకల్ అయితే తెలంగాణలో రెండు గ్రామాలను ఎందుకు దత్తత తీసుకుంటాను, టాలీవుడ్లోనే పనిచేశాను. అప్పుడు నేను నాన్ లోకల్ అని ఎందుకు అడగలేదు. నటుడికి లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు. జాతీయ అవార్డులు తెలుగు సినిమాలకు నాకు ఇచ్చారు. నాన్ లోకల్ అయితే ఎందుకు ఇస్తారు. మా అసోసియేషన్ అభివృద్ధి నా దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయి. మా ప్యానల్ సభ్యులకు అది తెలుసు అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement