Saturday, March 23, 2024

ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా మళ్ళీ వాయిదా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆది పురుష్ , సలార్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. కానీ కరోనా కారణంగా మొదటి మూడు సినిమాలు కూడా ఆలస్యం అవుతూ వచ్చాయి. అయితే ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాలకు సంబంధించి ఓ విషయం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది. మొదట సెప్టెంబర్ లో గాని లేదా అక్టోబర్ లో గాని ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా మూడవ వేవ్ గురించి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అమితాబచ్చన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఈ సినిమాలో నటించబోతుంది. దాంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అనుకున్న సమయంకు సినిమా ప్రారంభం అయ్యి ఉంటే 2022 లో విడుదల అయ్యేది. కాని ఇప్పుడు విడుదల మరో ఏడాది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement