Saturday, April 20, 2024

ఇది కదా కావాల్సింది…ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు కేజిఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో తండ్రీకొడుకులుగా రెండు పాత్రలో ఈ సినిమా లో కనిపించనున్నాడట.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ విషయమై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఈ వార్త ప్రభాస్ అభిమానుల లో మాత్రం మంచి జోష్ తీసుకువచ్చింది. ఈ సినిమా తెలుగు, కన్నడ ,హిందీ, తమిళ్ మలయాళ భాషల్లో 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement