Thursday, April 18, 2024

శిల్పా శెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు: ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు

బాలీవుడ్ ని కుదిపేసిన ఫోర్న్ రాకెట్ కేసులో విచారణ కొనసాగుతోంది. నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని తెలిపారు. ప్ర‌స్తుతం తాము కుంద్రాకు చెందిన వియాన్ ఇండ‌స్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు. వియాన్ ప‌రిశ్ర‌మే పోర్న్ రాకెట్‌లో కీల‌కంగా ఉంది. దానికి శిల్పా శెట్టి డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శిల్పాశెట్టి అకౌంట్లోకి మాత్రం డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కుంద్రా అకౌంట్లోకి మాత్రం 1.17 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్లు ఆడిట‌ర్స్ గుర్తించారు. మ‌రోవైపు, రాజ్‌కుంద్రా పోర్నోగ్ర‌ఫీ వ్య‌వ‌హారంలో మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న కంపెనీకి చెందిన న‌లుగురు నిర్మాత‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. సినీ న‌టి గెహ‌నా వ‌శిష్ట పేరును కూడా చేర్చిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.

ఇది కూడా చదవండి: పెగాసస్‌ రచ్చ..రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపక్ష పార్టీల లేఖ..

Advertisement

తాజా వార్తలు

Advertisement