Thursday, March 28, 2024

టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతా: పూనమ్ కౌర్

టాలీవుడ్ లో డ్రగ్ కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం కొన్నాళ్లుగా.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. పొలిటికల్ గానూ.. ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  చేస్తున్న దర్యాప్తు… ఇష్యూను మరింత హీటెక్కిస్తోంది.  డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన  సమాచారంతో… కూపీ లాగుతున్నారు ఈడీ అధికారులు. ఇప్పటివరకు పూరీ, ఛార్మి విచారణ ఎదుర్కోగా, నేడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు మరికొందరు విచారణ ఎదుర్కోనున్నారు. దీంతో టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ కేసు చుట్టూ తిరుగుతోంది. ఇక ఈ అంశంప పై స్పందించారు నటి పూనమ్ కౌక్. డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు.

కాగా పూనమ్ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్నట్లుగా ఉండకూడదని నెట్టిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఎయిర్ పోర్టుల్లో, బార్డర్ లో కఠినమైన బందోబస్తు చర్యలను చేపట్టడం మంచిదంటున్నారు. సెలెబ్రిటీలైన, సామాన్యుడైన డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళు బాధితులే కానీ, నిందితులు కారని గత విచారణలోనే ముగింపు పలికినట్లుగా చెప్పిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నారు.

https://twitter.com/poonamkaurlal/status/1433692720455847937

ఇది కూడా చదవండి: Tokyo Paralympics: చ‌రిత్ర సృష్టించిన‌ అవ‌ని.. భారత్ కు పతకాల పంట

Advertisement

తాజా వార్తలు

Advertisement