Wednesday, April 17, 2024

సరికొత్త లుక్ లో వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్ . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిష్ తో కూడా మరో సినిమాని స్టార్ట్ చేసాడు. ఈ సినిమా కొండపొలం నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా మరో సినిమాని కూడా వైష్ణవ్ తీయబోతున్నారు. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ దర్శకుడు గిరీశాయ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా ఓ ఫోటో షూట్ చేశాడు వైష్ణవ్ తేజ్. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు కేవలం 40 నిమిషాల్లో 40 వేల లైక్స్ ను సాధించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CNkBZyWndNN/?igshid=1c98p9m2vjfuu

Advertisement

తాజా వార్తలు

Advertisement