Saturday, April 20, 2024

సెల్ఫీ అడిగితే హగ్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. ఆనందంలో అభిమాని

పబ్లిక్ లో సందడి చేసింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. దీంతో అక్కడున్న అభిమానులు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. వాళ్ళను నిరాశపరచకుండా పాయల్ సెల్ఫీలకు ఫోజిచ్చారు. ఓ అభిమాని మీద పాయల్ చేయి వేసింది. అంతటితో ఆగకుండా స్మాల్ హగ్ ఇచ్చింది. దాంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వీడియో పాయల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. పాయల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు. చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది.

విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కన్నడ, తమిళ భాషల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement