Saturday, April 20, 2024

పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ @ ఠాగూర్ మధు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి సినిమా దాదాపుగా కన్ఫామ్ అయిందని తెలుస్తోంది.

నిర్మాత ఠాగూర్ మధు కు గతంలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడట. ఇప్పుడు ఆ సినిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికే పవన్ కళ్యాణ్ పూరి ల మధ్య స్టోరీ కి సంబంధించి మొదటిదశ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపించబోతున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement