Friday, April 26, 2024

శిల్పకళావేదికలో ‘పవన్’ నామస్మరణ

విడుదలకు ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నా టాలీవుడ్‌లో అప్పుడే ‘వకీల్ సాబ్’ మేనియా నెలకొంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ అభిమానులు సందడి చేశారు. పవన్ కోసం ఈ ఫంక్షన్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ ఏ సమయానికి వస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో అభిమానులను సంతోషసాగరంలో ముంచెత్తుతూ పవన్ కల్యాణ్ తన మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈవెంట్‌కు వచ్చారు. పవన్‌కు నిర్మాత దిల్ రాజు స్వాగతం పలికారు. కాగా పవన్ రాకతో కాసేపు శిల్పకళావేదిక అభిమానుల నినాదాలతో మార్మోగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement