Friday, March 29, 2024

ఆరెంజ్ రీ రిలీజ్..మూడు రోజుల్లో రూ.. 3కోట్ల గ్రాస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెర‌కెక్కించాడు. కాగా నాగబాబు తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెనీలియా హీరోయిన్. ఈ సినిమాలో, ప్రభు .. ప్రకాశ్ రాజ్ .. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రేమకథను డిఫరెంట్ గా చెప్పడానికీ .. చరణ్ పాత్రను కొత్త కోణంలో చూపించడానికి భాస్కర్ ప్రయత్నించాడు. అయితే ఆయన ఆలోచన విధానం .. కొత్తగా చెప్పాలనుకున్న పాయింట్ యూత్ కి కనెక్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. నాగబాబును నష్టాలపాలు చేసింది. అలాంటి ఈ సినిమాను ఇ రీ రిలీజ్ చేశారు. మూడు రోజుల పాటు ప్రదర్శితమయ్యే ఈ సినిమా వల్ల వచ్చే డబ్బులు, ‘జనసేన’ పార్టీకి ఇస్తానని నాగబాబు అన్నారు. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 3 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని నాగబాబు అధికారికంగా ప్రకటిస్తూ, రీ రిలీజ్ లో ఈ సినిమా హిట్ కావడం విశేషమ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement