Saturday, April 20, 2024

‘మహాసముద్రం’ అప్డేట్ !!

ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు దర్శకుడిగా గుర్తింపు తీసుకువచ్చింది. అజయ్ భూపతి ప్రస్తుతం అజయ్ భూపతి మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం వైజాగ్ లో నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా మొత్తం చిన్నతనం నుంచే ఒకరిపై ఒకరు ద్వేషంతో రగిలిపోయే ఇద్దరు ఆవేశపరులు మధ్య జరిగే యాక్షన్ డ్రామాట.

ఈ సినిమాలో ఓ హీరోయిన్ పాత్ర చనిపోతుందట. అలాగే సిద్ధార్థ , శర్వా లుఇప్పటివరకు నటించని అద్భుతమైన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ మల్టీస్టారర్ ను నిర్మిస్తున్నారు. అలాగే అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 19న ఈ సినిమాను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement