Saturday, April 20, 2024

ఆగస్ట్ 6న ముగ్గురు మొనగాళ్లు

నటుడు శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించారు. అంతే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా తీస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరికి కనిపించదు, ఒకరి వినిపించదు, ఒకరికి మూగ.

అయితే ఈ ముగ్గురు కూడా జీవితంలో ఊహించని విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి… అనే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాను ఆగష్టు 6న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కరోనా కారణంగా లాంగ్ గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement