Wednesday, April 24, 2024

దిల్ రాజుకు నోటీసులు….!!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హసన్ నటించగా… అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజుకు ఇప్పుడు ఒక షాక్ తగిలింది. సుధాకర్ అనే వ్యక్తి ఈ సినిమాలో తన ఫోన్ నెంబర్ ను తన అనుమతి లేకుండా స్క్రీన్ మీద చూపించారని…దీంతో చాలా మంది తనకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయమై బాధితుల తరపు లాయర్ నిర్మాతలకు నోటీసులు జారీ చేశాడు. మరి ఈ వివాదం పై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement